దొరవారి తిమ్మాపురం ఖాళీ చేయించడంపై కమ్యూనిస్టులు లేఖ

దొరవారి తిమ్మాపురం ఖాళీ చేయించడంపై కమ్యూనిస్టులు లేఖ

మహబూబాబాద్ మావోయిస్టు పార్టీ ఇల్లెందు – నర్సంపేట ఏరియా కమిటి కార్యదర్శి పాపన్న పేరుతో కమ్యూనిస్టులు లేఖ విడుదల చేశారు. గూడూరు మండలం మట్టేవాడ  శివారు ఏజెన్సీ గ్రామం దొరవారి తిమ్మాపురాన్ని ఖాళీ  చేయించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అందులో హెచ్చరించారు. శతాబ్దానికిపైగా నివాసముంటున్న ప్రజలను ఖాళీ చేయించడం హేయమైన చర్య అని ప్రకటించారు. గ్రామాన్ని అన్ని సౌకర్యాలున్న ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు గ్రామ ప్రజలకు అండగా ఉండాలని మావోయిస్టులు లేఖలో కోరారు. ఆదివాసీ గ్రామాలపై కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.