మున్సిపల్ చైర్మన్ భర్తపై ఫిర్యాదు

మున్సిపల్ చైర్మన్ భర్తపై ఫిర్యాదు

చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూపరాణి భర్త శ్రీధర్ రెడ్డిపై వైస్ ఛైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి బుధవారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అధికారాలు లేకున్నా పాలనాపరమైన విషయాల్లో చైర్ పర్సన్ భర్త జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. వైస్ ఛైర్మన్ గా తన వార్డులో పనిచేసుకుంటున్న తనను పలు సందర్భాల్లో అవమానించారని పేర్కొన్నారు. గత వారం.. సెప్టెంబర్ 27వ తేదీన అకారణంగా శ్రీధర్ రెడ్డితోపాటు అతడి తమ్ముడు కృష్ణారెడ్డి దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజీవ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై మోహన్ బాబు చెప్పారు.