హెచ్సీఏపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు

హెచ్సీఏపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో  హైకోర్టు న్యాయవాది సలీం ఫిర్యాదు  చేశారు. ఈ నెల 25న ఉప్పల్లో జరగనున్న ఇండియా- ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన టికెట్ల విక్రయాలపై అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడా అభిమానులను మోసం చేస్తూ ... అక్రమంగా టికెట్లను బ్లాక్ లో హెచ్సీఏ విక్రయిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి , టికెట్ల విక్రయ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు.

రెండేండ్ల విరామం తర్వాత హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. 3 మ్యాచ్ల టీ 20 సిరీస్ కోసం ఈనెల 20 నుంచి భారత్ లో పర్యటిస్తుంది ఆస్ట్రేలియా  క్రికెట్ టీమ్. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25న జరిగే మూడో టీ 20లో టీమిండియాతో తలపడనుంది.