ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు కంప్లీట్ చేయండి : అనుదీప్

ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు కంప్లీట్ చేయండి :   అనుదీప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను హైదరాబాద్ జిల్లా ఉప ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మంగళవారం గోషామహల్, నాంపల్లి, కార్వాన్ సెగ్మెంట్లకు చెందిన డీఆర్సీలను సందర్శించారు. ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని, ఎన్నికల అధికారులకు భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల పంపిణీకి షెడ్స్, భోజనం తయారు, వడ్డించే కౌంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.