పంచ్ ప్రసాద్ ఆపరేషన్ సక్సెస్.. సీఎంఆర్ఎఫ్ నుండి ఆర్ధిక సహాయం

పంచ్ ప్రసాద్ ఆపరేషన్ సక్సెస్.. సీఎంఆర్ఎఫ్ నుండి ఆర్ధిక సహాయం

జబర్దస్త్‌ కమెడియన్ పంచ్‌ ప్రసాద్‌(Punch Prasad) చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా యశోద ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందని ఆయన భార్య సునీత తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇక ప్రసాద్ తన రెండు కిడ్నీలు పాడవడం వల్ల కొద్దిరోజులగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. కానీ ఆరోగ్యం విషమించడంతో.. కిడ్నీల మార్పిడి జరిగితేనే బ్రతుకుతాడని వైద్యులు తెలిపారు.

ఇదే విషయాన్ని వివరిస్తూ జబర్దస్త్‌ నూకరాజు ఓ వీడియో షేర్‌ చేశాడు. ఆ సమయంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేశారు. ఆ తరువాత పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి మంత్రి రోజా తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన ఆయన.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ప్రసాద్‌కు వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఈమేరకు యశోద ఆస్పత్రి పంచ్‌ ప్రసాద్‌కి వైద్యం అందించింది. 

ఇదే విషయంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రసాద్ భార్య సునీత. పంచ్‌ ప్రసాద్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స పూర్తి అయిందని,  ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగుందని, త్వరలో ఆయన మన ముందుకు వస్తారని, మీ అందరి ఆశీస్సుల వల్లే ఆయనకు ఈ ఆపరేషన్ జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు.. ప్రసాద్ ట్రీట్మెంట్ కోసం సహాయం అందించిన ఏపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అంటూ తెలిపారు సునీత.