
మృగశిరకార్తె సందర్భంగా నిజామాబాద్ నగరంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నగరంలోని బోధన్ రోడ్డులో ని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం చేప ప్రసాదం అందించారు. స్థానికంగా ఉండే మహమ్మద్ అహ్మద్ కుటుంబీకులు 60 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
ఈ ప్రసాదం కోసం పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రజలతో పాటు జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు చేప ప్రసాదం కోసం బారులు తీరారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మందు అందజేస్తారు. సుమారు 500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ విక్లీ మార్కెట్ లో చేప ప్రసాదం పంపిణీ వద్ద ప్రజలు గుమిగూడారు. -వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్