
- ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, వెలుగు: ఆధ్యాత్మిక, సేవా రంగాలతో పాటు వివిధ వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టిస్తున్న ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ప్రవేశించి గుర్తింపు పొందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆనంద్నగర్ ఆర్యవైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకరణ ప్రోగ్రామ్కు అటెండైన ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఆగ్రవర్ణ పేదలకు కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు.
స్టేట్ గవర్నమెంట్ కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఫండ్స్ ఇవ్వక కాంగ్రెస్ పార్టీ నేతలకు చైర్మన్ పదవులు ఇచ్చి వదిలేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు అసలు నిధులు ఇవ్వడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి కోసం సర్కార్ నుంచి నయా పైసా పొందలేదన్నారు. కట్కం చిరంజీవి, మురికి రాజేందర్, పబ్బ రాజు, అయిత శ్రీనివాస్, చింత సత్యనారాయణ, ధన్పాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బోర్గాంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్నారు.