ఆర్య వైశ్యులతో సంపద సృష్టి : ధన్ పాల్ సూర్యనారాయణ

ఆర్య వైశ్యులతో సంపద సృష్టి : ధన్ పాల్ సూర్యనారాయణ
  • ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, వెలుగు:  ఆధ్యాత్మిక, సేవా రంగాలతో పాటు వివిధ వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టిస్తున్న ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ప్రవేశించి గుర్తింపు పొందాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆనంద్​నగర్ ఆర్యవైశ్య హౌస్​ ఓనర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ కొత్త కమిటీ ప్రమాణ స్వీకరణ ప్రోగ్రామ్​కు అటెండైన ఆయన ప్రసంగించారు. ​ కేంద్ర ప్రభుత్వం ఆగ్రవర్ణ పేదలకు కల్పించిన ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్​తో విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు.

స్టేట్​ గవర్నమెంట్​ కులానికో కార్పొరేషన్​ ఏర్పాటు చేసి ఫండ్స్​ ఇవ్వక కాంగ్రెస్​ పార్టీ నేతలకు చైర్మన్​ పదవులు ఇచ్చి వదిలేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్​కు అసలు నిధులు ఇవ్వడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి కోసం సర్కార్​ నుంచి నయా పైసా పొందలేదన్నారు. కట్కం చిరంజీవి, మురికి రాజేందర్​, పబ్బ రాజు, అయిత శ్రీనివాస్​, చింత సత్యనారాయణ, ధన్​పాల్ శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బోర్గాంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్నారు.