పయనం ప్రారంభం

పయనం ప్రారంభం

‘రోటి కపడా రొమాన్స్‌‌‌‌’  చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన సుప్రజ్‌‌‌‌.. నటిస్తున్న తాజా చిత్రం ‘పయనం’. చందురామ్ దర్శకత్వంలో స్వర్ణ కమల నిర్మిస్తున్నారు. ‘జనక అయితే గనక’ ఫేమ్ సంగీర్తన విపిన్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కొరియోగ్రాఫర్‌‌‌‌ రఘు క్లాప్‌‌‌‌ కొట్టగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్విచాన్  చేశాడు.

ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త కాన్సెప్ట్‌‌‌‌తో రూపొందిస్తున్న చిత్రమిది.  డ్రామా సస్పెన్స్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కనుంది. ఆడియెన్స్‌‌‌‌ను సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్  చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్‌‌‌‌  ముఖ్యపాత్రలో కనిపిస్తారు’ అని చెప్పాడు.  నిర్మాత మాట్లాడుతూ ‘ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది. మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. జులై 7 నుండి రెగ్యులర్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ ప్రారంభిస్తాం’ అని చెప్పారు.  ఆమని, మైమ్‌‌‌‌ మధు, మెహబూబ్‌‌‌‌ భాషా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు.