ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన

ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన

ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నగరంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ఖాళీ కుండలతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింతల రామచంద్రారెడ్డి.. ప్రభుత్వం వాటర్ బోర్డుకు ఇస్తానన్న రూ. 500 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలుషిత నీళ్లు తాగి జనం చనిపోతున్నారని మండిపడ్డారు. కలుషిత నీరు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.