నిమ్స్ లో నర్సుల ఆందోళన.. ఆగిన ఆపరేషన్లు

నిమ్స్ లో నర్సుల ఆందోళన.. ఆగిన ఆపరేషన్లు

హైదరాబాద్  పంజాగుట్టలోని నిమ్స్ లో నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హస్పిటల్ ముందు పెద్ద సంఖ్యలో నర్సులు బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి నర్సులు ఆందోళనకు దిగగా..ఇంకా నిరసన కొనసాగుతోంది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా నిమ్స్ లో ఇతర వైద్య సేవలు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన ఆపేది లేదని నర్సులు చెప్పారు.

ఇంఛార్జి డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని నర్సులు ఆరోపించారు.  డ్యూటీలకు రావడం లేదంటూ ముగ్గురి నర్సులకు నిమ్స్  డైరెక్టర్ మెమోలు జారీ చేశారు.  అయితే ఈ మెమోలను వెనక్కి తీసుకోవాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.  న