ఆర్మూర్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి : పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్

ఆర్మూర్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి : పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్

​ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్​మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో గెలిచి కాంగ్రెస్​ జెండా ఎగరవేయాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ప్రొద్దుటూరి వినయ్​ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్​కుమార్ గౌడ్ మాట్లాడుతూ గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్స్​ కేటాయించాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్​ సత్తా చాటాలన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​ చైర్మన్​ ఈరవత్రి అనిల్, బిజ్జు దత్తాద్రి, చెలిమెల శ్రీనివాస్​, దాసరి సునీల్, అంబల్ల తిరుపతి, చిట్ల యజ్ఞేశ్, బండారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.