ఇవాళ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రేక్ ఇచ్చారు . ఇవాళ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి రేపట్నుంచి యాత్ర కొనసాగిస్తామన్నారు. నిన్న తిరువనంతపురంలో శివగిరి మఠాన్ని సందర్శించారు. ప్రముఖ తత్వవేత్త.. సంఘ సంస్కర్త నారాయణ గురుకు నివాళులర్పించారు. నారాయణ గురు బోధనలకు విరుద్ధంగా భాజపా, RSSలు వ్యవహరిస్తూ హింసను, ద్వేషాన్ని నింపుతున్నాయని ఆరోపించారు. నిన్న కొల్లం జిల్లాలో అడుగుపెట్టారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. రాహుల్ , ఇతర కార్యకర్తలు ఇవాళ పాదయాత్ర చేయకుండా విశ్రాంతి తీసుకుని, రేపట్నుంచి జోడో యాత్ర కొనసాగిస్తారు.
Congress' Bharat Jodo Yatra will resume on Friday
— ANI Digital (@ani_digital) September 15, 2022
Read @ANI Story | https://t.co/MybJQ3skCK#Congress #BharatJodaYatra #RahulGandhi pic.twitter.com/1Fz0qlXDMX