ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం : దామోదర రాజనర్సింహ

ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం : దామోదర రాజనర్సింహ

 రేగోడ్, వెలుగు:  తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుల కుటుంబాలను విస్మరించిందని, వారికి రాజకీయంగా సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆందోల్ ​నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు,  బీఆర్ఎస్ సీనియర్​ నాయకులు తమ అనుచురులతో కలిసి దామోదర్​ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తమకు బీఆర్‌‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.

మధ్యలో వచ్చిన వారికి పదవులు, ప్రభుత్వ పథకాలు కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థి క్రాంతి కిరణ్​ను ఓడించి కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్​లో చేరినవారిలో సంగారెడ్డి, శ్రీనివాస్, జయరావ్​, అంజయ్య, లక్ష్మణ్​ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు కిషన్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ యాదగిరి, రాజేందర్ పాటిల్, కోఆప్షన్ మెంబర్​ చోటు మియా, మల్లేశం, , జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.