అందుబాటులో ఉంటా.. అభివృద్ధి చేస్తా : పొద్దుటూరి వినయ్ రెడ్డి

అందుబాటులో ఉంటా.. అభివృద్ధి చేస్తా : పొద్దుటూరి వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: తాను ఆర్మూర్​ లోకల్ ​బిడ్డనని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి  పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఆర్మూర్ టౌన్ లోని కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

గడిచిన పదేండ్లలో కేసీఆర్ ​ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, అవినీతి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కూడబెట్టారన్నారు. కాంగ్రెస్​పార్టీకి చెందిన మాజీ మంత్రి అర్గుల్ రాజారాం హయాంలోనే నియోజకవర్గంలో ఇండ్ల జాగాలు ఇచ్చారని, ఆ తర్వాత ఏ పాలకులు పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు సాయిబాబా గౌడ్, కోల వెంకటేశ్, మహమూద్ అలీ, రేగుల సత్యనారాయణ, హబీబ్ పాల్గొన్నారు.