ముగిసిన కాంగ్రెస్​ సీఈసీ మీటింగ్​.. బలమైన అభ్యర్థులే టార్గెట్​

ముగిసిన కాంగ్రెస్​ సీఈసీ మీటింగ్​..  బలమైన అభ్యర్థులే టార్గెట్​

భోపాల్​: రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్​ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఈ మీటింగ్​కు అధ్యక్షత వహించారు. ఇందులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, అధిర్​ రంజన్​ చౌదరి, అంబికా సోనీ, మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ కమల్​ నాథ్​ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో తమ పార్టీ తరపున బరిలోకి దింపేందుకు కీలక నేతలను ఎంపిక చేయడమే లక్ష్యంగా ఈ మీటింగ్​ జరిగింది. త్వరలోనే అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రకటించనుంది. మధ్యప్రదేశ్​లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్​ 17న వీటికి పోలింగ్​ నిర్వహించనున్నారు.