పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని సోమన్గుర్తి గ్రామపంచాయతీకి మరోసారి ఎలక్షన్ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పూడూరు ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమన్గుర్తి గ్రామంలో ఓట్ల కౌటింగ్లో ఓ అధికారి బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకులంగా వ్యవహరించారని ఆరోపించారు.
ఆర్వోకు ఫిర్యాదు చేసిన పట్టించకోలేదన్నారు. అనంతరం వికారాబాద్కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, అడిషనల్ కలెక్టర్ సుధీర్కు ఫిర్యాదు చేశారు.
