పరిగిలో ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

పరిగిలో ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

పరిగి, వెలుగు: పరిగిలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. శనివారం పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఆయన నివాసంలో ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 

ముస్లింల ఓట్లను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కావాలనే కొందరు జిల్లాలోని ముస్లిం మత పెద్దలతో మీటింగ్‌‌లు పెడుతున్నారన్నారు. ఈ సమావేశంలో ముస్లిం సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.