బీఆర్ఎస్​, బీజేపీ ఒక్కటే: షబ్బీర్ అలీ

బీఆర్ఎస్​, బీజేపీ ఒక్కటే: షబ్బీర్ అలీ

కామారెడ్డి, వెలుగు:  బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో  ఆ విషయం స్పష్టమైందని కాంగ్రెస్​నేత,  మాజీ మంత్రి  షబ్బీర్​అలీ ఆరోపించారు. అభివృద్ధి పనుల ​కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని  చెప్తున్నా, ఢిల్లీలో రహస్య మీటింగ్​లు జరుగుతున్నాయన్నారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడుతూ..  డిఫెన్స్​ మినిస్టర్​తో పాటు,  హోమంత్రి అమిత్​షాను కూడా కలుస్తున్నారన్నారు. 

ప్రధానమంత్రి రాష్ట్రానికి 3 సార్లు వచ్చారని, అప్పుడెందుకు కలువలేదని ప్రశ్నించారు. కనీసం ఎయిర్​పోర్ట్​లో  రిసీవ్ ​చేసుకోడానికి  సీఎం కానీ, మంత్రి కేటీఆర్​ కానీ వెళ్లలేదన్నారు.  త్వరలో ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కలుస్తున్నారని,  రోడ్ల వెడల్పు కోసం డిఫెన్స్​భూములు అడుగుతున్నామని  కేటీఆర్ చెప్తున్నారని విమర్శించారు.  ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపకుండా ఉండేందుకే రహస్య మీటింగులని  ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్​లో  అవినీతి, కమీషన్లపై  ఎంక్వైరీ చేస్తాం,  లోపల వేస్తామని 2 ఏండ్ల నుంచి  బీజేపీ చెప్తోందని,  ఢిల్లీ డిప్యూటీ సీఎంను  జైల్లో  వేసినా, ఎమ్మెల్సీ కవిత మాత్రం బయట ఉన్నారని  విమర్శించారు.