దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది

దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది
  •     మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి

మల్కాజిగిరి, వెలుగు : దేశంలో బీజేపీ గ్రాఫ్​పడిపోతుందని కాంగ్రెస్​నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ ఓడిపోవడం ఖాయమని విమర్శించారు. బుధవారం ఆనంద్​బాగ్​లో  పార్టీ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించి వారు మీడియాతో మాట్లాడారు. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే సిద్ధాంతం తమ పార్టీదని పేర్కొన్నారు. దేశం,రాష్ర్టం బాగుండాలంటే  అన్నిమతాల ప్రజలు బాగుండాలని, మత రాజకీయాలు చేయడం సరికాదని వారు హితవు పలికారు.

అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించరాఉ. కార్యక్రమంలో పార్టీ నేతలు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,ఉప్పల్ ఇన్ చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్ర నాథ్,  బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.