తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కాంగ్రెస్ నేత చేయూత

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కాంగ్రెస్ నేత చేయూత

యాదాద్రి భువనగిరి జిల్లా: మైలారంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులను పరామర్శించారు ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య. చిన్నారులకు బీర్ల ఫౌండేషన్ తరుపున పదివేల ఆర్థికసాయాన్ని అందించిన ఐలయ్య.. భవిష్యత్తులో చిన్నారుల చదువుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామన్నారు. ఏడాది కింద చిన్నారుల తల్లి చనిపోగా…మూడు రోజుల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.