కవితకు నోటీసుల వ్యవహారం.. టీవీ సీరియల్ లాగా సాగుతోంది : జగ్గారెడ్డి

 కవితకు నోటీసుల వ్యవహారం.. టీవీ సీరియల్ లాగా  సాగుతోంది : జగ్గారెడ్డి

బీఆర్ఎస్త్ ఎమ్మెల్సీ కవితకు నోటీసుల వ్యవహారం సురభి నాటకం, టీవీ సీరియల్ లా సాగుతుందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ లబ్ధి పొందాలని బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయని విమర్శించారు. కేంద్రమంత్రులు ఢిల్లీలో ఒకమాట.. రాష్ట్రానికి వస్తే మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవిత అక్రమ అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ నాలుగు సీట్లు గెలవాలని చూస్తోందన్నారు జగ్గారెడ్డి. 

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలపు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చింది సీబీఐ. ఈనెల 26న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కవితను నిందితురాలిగా పేర్కొంటూ 41 ఏ కింద సమన్లు జారీ చేసింది సీబీఐ. 2022 డిసెంబర్లో కవితను ఓసారి ప్రశ్నించింది సీబీఐ.