ఈసారి ఎంపీగా పోటీ చేస్త కాంగ్రెస్ నేత జానారెడ్డి

ఈసారి ఎంపీగా పోటీ చేస్త  కాంగ్రెస్ నేత జానారెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ నేత జానారెడ్డి తెలిపారు. తన కొడుకులు అసెంబ్లీకి పోటీ చేస్తారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను జానారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అంశాలతో పాటు తన కొడుకులకు అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై చర్చించినట్టు తెలిసింది. 

ఖర్గేతో భేటీ అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ గెలుపునకు ఐక్య వేదిక అవసరమని ఖర్గేకు సూచించినట్టు చెప్పారు. కాగా, మిర్యాలగూడ నుంచి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ నుంచి చిన్న కొడుకు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.