సూసైడ్ చేసుకున్న టీచర్ పిల్లలను దత్తత తీసుకున్న జానారెడ్డి కొడుకు

సూసైడ్ చేసుకున్న టీచర్ పిల్లలను దత్తత తీసుకున్న జానారెడ్డి కొడుకు

కరోనా సెకండ్ వేవ్‌తో స్కూళ్లు మరోసారి మూతపడటంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన ప్రైవేట్ టీచర్ వెన్నం రవి, ఆయన భార్య సూసైడ్ చేసుకొని రెండు రోజుల క్రితం చనిపోయారు. దాంతో వారి పిల్లలు అనాధలుగా మారారు. మృతుడు రవి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సాగర్ అభ్యర్థి జానారెడ్డి కొడుకు రఘువీర్ పరామర్శించాడు. రవి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి.. పిల్లలను దత్తత తీసుకుంటానని వారికి చెప్పాడు. అంతేకాకుండా.. పిల్లల చదువులు, ఇతర ఖర్చులన్నీ తానే చూసుకుంటానని రఘువీర్ హామీ ఇచ్చాడు. సాగర్‌లో ఉపఎన్నిక దగ్గరపడుతున్న సమయంలో.. జానారెడ్డి కొడుకు రఘువీర్.. మృతుడు రవి కుటుంబాన్ని పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.