కేసీఆర్​ పాలనలో అభివృద్ధి శూన్యం : కాంగ్రెస్​ నాయకుడు కొండల్​రెడ్డి

కేసీఆర్​ పాలనలో అభివృద్ధి శూన్యం : కాంగ్రెస్​ నాయకుడు కొండల్​రెడ్డి

కామారెడ్డి, కామారెడ్డిటౌన్, వెలుగు: కేసీఆర్ పాలనలో  నిరుపేదలకు జరిగిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ నాయకుడు కొండల్​రెడ్డి  అన్నారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో  కొండల్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. 3, 4 వార్డుల్లో స్థానికులతో కలిసి ఆయన చాయ్ పే చర్చ  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలను  భర్తీ చేయక నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్​ హయాంలోనే ఇందిరమ్మ  ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు.  కామారెడ్డి ప్రజలు కేసీఆర్​కు బాయ్​ బాయ్​ చెప్పనున్నారన్నారు.  

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి  స్కీమ్​ ద్వారా  మహిళలకు ప్రతి నెలా రూ.2,500తో పాటు,  రూ. 500లకే గ్యాస్​ సిలిండర్​ ఇస్తామన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్​, రూ. 2 లక్షల  రుణమాఫీ చేయనున్నామన్నారు. అనంతరం  మోచి ( శ్రీ సంత్​ రవిదాస్​ సంఘర్​ ) సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వాలని కోరారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత మోచి కులస్తుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం  అయ్యప్ప టెంపుల్​లో  నిర్వహించిన  మండల పూజలో పాల్గొన్నారు.  ఆయా కార్యక్రమాల్లో ఏఐసీసీ ఇన్​చార్జి రిజ్వాన్​, డీసీసీ ప్రెసిడెంట్​ శ్రీనివాస్​రావు, పండ్ల రాజు, గొనే శ్రీనివాస్,  చంద్రశేఖర్​రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.