
- దేశానికి ఇందిర దుర్గామాతలా ..విజయం అందించారు
- కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మన దేశానికి దుర్గామాతలా విజయం అందించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఉక్కు సంకల్పంతో పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించారని గుర్తుచేశారు. ఆమె నిర్ణయాల వల్లే 1971 యుద్ధంలో విజయం సాధించామన్నారు.శనివారం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్1971 విజయోత్సవం సందర్భంగా గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లిబరేషన్ వార్ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
అనంతరం మహేశ్కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచం అబ్బురపడేలా ఓ దుర్గామాతలాగా దేశానికి ఇందిరా గాంధీ విజయాన్ని అందించారన్నారు. పాకిస్తాన్తో భారత సైన్యం పోరాడి విజయం సాధించిందని తెలిపారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి తక్కువ కాలం పాటు జరిగిన యుద్ధంలో గెలిచి ప్రపంచానికి దేశ శక్తిని ఆర్మీ నిరూపించిందని గుర్తుచేశారు. అప్పటి చరిత్రను ఇప్పటి సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.