బీజేపీ డైరెక్షన్ మేరకే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తో కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ఆస్తులను పెంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. అబద్ధాలకు కేసీఆర్ అంబాసిడర్ అని.. నిలువునా మోసం చేయడంలో దిట్టా అని విమర్శించారు.
దళిత సీఎం, ఇంటికో ఉద్యోగం, గిరిజన రిజర్వేషన్, నిరుద్యో భృతి అని కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మహేశ్ కుమార్ విమర్శించారు. కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం దళితబంధు, మునుగోడు కోసం గోర్ల పంపిణీ పెట్టారని ఆరోపించారు. గొర్లకు బదులు డబ్బులు వేసి 33 వేల అకౌంట్లను ఫ్రీజ్ చేశారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రావడానికి కేసీఆర్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తాయిలాలు ఇస్తున్నాడని ఆరోపించారు. ఫక్తు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ముందున్నాడని విమర్శించారు.