అభివృద్ధిని పట్టించుకోని మల్లారెడ్డికి ఎందుకు ఓటేయాలి? : రాపోలు రాములు

అభివృద్ధిని పట్టించుకోని మల్లారెడ్డికి  ఎందుకు ఓటేయాలి? : రాపోలు రాములు

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పది రూపాయలు కూడా తీసుకురాలేని మంత్రి మల్లారెడ్డికి ఇక్కడ జనం ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ నేత, బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య  చైర్మన్ రాపోలు రాములు ప్రశ్నించారు. శనివారం బోడుప్పల్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కేసీఆర్, కేటీఆర్​కు భజనం చేయడం తప్ప మంత్రి మల్లారెడ్డి జనాలకు చేసిందేమీ లేదన్నారు. బోడుప్పల్​కు చెందిన కాంగ్రెస్ మేడ్చల్ అభ్యర్థి వజ్రేశ్​యాదవ్​ను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో నాయకులు చెంచల నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజేశ్, నరేశ్ పాల్గొన్నారు.