
హుజురాబాద్, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమని, ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ.20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బెదిరింపులు, వసూళ్లే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి రాజకీయమని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి తొత్తులుగా మారిన వ్యక్తులు ఏ తప్పు చేసినా, అది కరెక్టే అన్నట్లుగా కేటీఆర్, హరీశ్రావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
ఏదో ఉద్యమం చేసి రిలీజ్ అయిన వ్యక్తిలాగా సోషల్ మీడియాలో కౌశిక్ రెడ్డి బిల్డప్ ఇవ్వడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల తిరుపతి, మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, తుమ్మనపల్లి ప్యాక్స్ చైర్మన్ కౌరు సుగుణాకర్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, మండల ప్రెసిడెంట్ పుల్ల రాధ, కాంగ్రెస్ సీనియర్ నేత సొల్లు బాబు, తదితరులు పాల్గొన్నారు.