రేవంత్​ సీఎం కావడంతో ..కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు

రేవంత్​ సీఎం కావడంతో ..కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు

కోల్​బెల్ట్​,వెలుగు : తెలంగాణ సీఎంగా రేవంత్​రెడ్డి ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. మంగళవారం మందమర్రిలోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు  కాంగ్రెస్​ లీడర్లు, అభిమానుల మధ్య స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు.  

మార్కెట్​లో ఎన్ఎస్​యూఐ మాజీ స్టేట్​ సెక్రటరీ మహంత్​ అర్జున్​ కుమార్​ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో ​ లీడర్లు కాసర్ల శ్రీనివాస్​, గడ్డం శ్రీనివాస్​, నల్లాల శ్రవన్​, పైడిమల్ల నర్సింగ్​, పాషా, తిరుమల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.