హుస్నాబాద్ లో బండి సంజయ్ పై కేసు నమోదు..

హుస్నాబాద్ లో బండి సంజయ్ పై కేసు నమోదు..

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై హుస్నాబాద్ పోలీసులకు  కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.  ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం మంత్రి పొన్నంను అవమానించేలా ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోలనకు పిలుపునిచ్చారు. దీంతో ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని ముందస్తు జాగ్రత్తతో బండి సంజయ్ బస చేసిన  బొమ్మెనపల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

యాత్రలో భాగంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కాంగ్రెస్ నాయకులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాముడు అయోధ్యలో పుట్టాడనేందుకు గ్యారంటీ ఏంటని కాంగ్రెస్ నేతలు అంటున్నారని..  రాముడు అయోధ్యలోనే పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయని.. మరి మీరు మీ తల్లికే పుట్టారనేందుకు గ్యారంటీ ఏంటని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.