స్మశాన వాటిక కోసం నిరసన చేస్తే CI తప్పుడు కేసులు

స్మశాన వాటిక కోసం నిరసన చేస్తే CI తప్పుడు కేసులు

మంత్రి కొప్పుల ఈశ్వర్ కి వత్తాసు పలుకుతూ యువకులను వేధిస్తున్నారంటూ.. ధర్మపురి CI లక్ష్మణ్ బాబుపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు.  ధర్మపురిలో స్మశాన వాటిక కావాలని నిరసన తెలిపిన యువకులపై CI తప్పుడు కేసులు పెడుతూ…కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్.  పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. జగిత్యాలలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. ధర్మపురి సీఐపై చర్యలు తీసుకుని యువకులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.