మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక చర్చ

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక చర్చ

ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించనున్నారు. బై పోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసిన నేపథ్యంలో మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నేతలతో గాంధీ భవన్ లో కీలక భేటీ జరగనుంది. భంగపడ్డ ఆశావాహులను పిలిచి బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాల మేరకు మునుగోడులో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. AICC సెక్రటరీ బోసు రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి హజరుకావాలని పాల్వాయి స్రవంతి, టిక్కెట్ ఆశించి భంగపడ్డ చెల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేతలకు పీసీసీ పెద్దలు ఆహ్వానం పంపారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.