న్యూ ఢిల్లీ: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఇండియా టీవీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ను ఇవాళ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా కాంగ్రెస్ నిలువనుంది. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ కు 8, భారతీయ జనతా పార్టీకి ఆరు స్థానాలు దక్కుతాయని పేర్కొంది.
మొన్నటి వరకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కేవలం రెండు సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఖరారైన మాధవి లత చేతిలో ఒవైసీ ఓడిపోయే అవకాశాలున్నాయని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.