కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ సెల్ చైర్మన్ సోహేల్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ సెల్ చైర్మన్  సోహేల్ రాజీనామా

 

  • ఓల్డ్ సిటీలో ముస్లిమేతరులకు సీట్లిచ్చారని విమర్శ
  • ఖర్గేకు లేఖ పంపిన షేక్ అబ్దుల్లా సోహెల్

హైదరాబాద్: కాంగ్రెస్ కు ఆ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ సోహేల్ రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేకు పంపారు. జూబ్లీహిల్స్ టికెట్ ను విష్ణువర్ధన్ రెడ్డికి కాకుండా అజారుద్దీన్ కు కేటాయించడం సరికాదన్నారు. జూబ్లీ హిల్స్ లో 40% ముస్లింలు ఉన్నారని, ఆ టికెట్ ను విష్ణుకు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.

ALSO READ : త్వరలో బీజేపీ థర్డ్ లిస్ట్ .. గ్రేటర్ సీట్లపై కమలం కసరత్తు

 70 శాతం ముస్లిం ఓటర్లున్న బహదూర్ పురా, చాంద్రాయణగుట్ట , యాకుత్ పురా స్థానాలను హిందువులకు కేటాయించారని, గెలిచే స్థనాలను రేవంత్ రెడ్డి వదులుకున్నారని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు కలత చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.