సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కలిసిన జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కలిసిన జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీ సెషన్స్ లో   కేసీఆర్ ను, కేటీఆర్ ను కలిసినట్లు చెప్పారు.  మియాపూర్ టూ సంగారెడ్డి, సదాశివ్  మెట్రో ట్రైన్ విషయాన్ని పరిశీలించాలని వినతి పత్రం ఇచ్చానని తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు  రూ.200 కోట్లు కేటాయించాలని సీఎంను కోరానన్నారు. నియోజకవర్గంలో దళితబంధు కోసం 500 మంది పేర్లను ప్రతిపాదించినట్లు చెప్పారు. మరోసారి ప్రగతి భవన్ లో కలిసేందుకు సీఎం అపాయింట్ మెంట్ కోరానని జగ్గారెడ్డి  చెప్పారు. తన విజ్ఞప్తులకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.