ట్రిపుల్ తలాక్ వల్ల భారత్ తలదించుకుంటది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ట్రిపుల్ తలాక్ వల్ల భారత్ తలదించుకుంటది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునేలా అయిందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రోజు జగిత్యాలలోని తన నివాసంలో మాట్లాడిన ఆయన.. కేంద్రం అన్ని మతాలు సమానం అంటూనే ఇస్లాంను గౌరవించడం లేదని చెప్పారు.  ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిలను ద్వితియశ్రేణి పౌరులుగా చూస్తుందని అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిషేధించడం సరికాదని అన్నారు జీవన్ రెడ్డి. స్వతంత్ర సమరయోధులను గౌరవించడం మన సాంప్రదాయమని చెప్పారు.