వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ

రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సప్లై ట్రాన్స్‌ఫార్మర్ చూపిస్తే సీఎం కేసీఆర్ కు తాను  పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  సవాల్ విసిరారు. జగిత్యాలలో  ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన టీఆర్ఎస్, కేసీఆర్ పై ఫైర్ ఆయ్యారు. రాష్ట్రానికి.. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడమనేది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు మధ్య ఉన్న రహస్య స్నేహానికి నిదర్శనమని అన్నారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నారని ఆరోపించారు.  

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ అని జీవన్ రెడ్డి ఏద్దెవా చేశారు.  మెగా కృష్ణారెడ్డి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ గా మారడానికి మిషన్ భగీరథ కారణమని, దాని ద్వారా వచ్చే నీళ్లు పాకీ పనులకు మాత్రమే ఉపయోగపడుతోందని అన్నారు.  రైతులకు వడ్డీ రాయితీ, విత్తన రాయితీ ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని జీవన్ రెడ్డి విమర్శించారు.