నా మీటింగులకు వస్తే ఇళ్లు ఇవ్వమని బెదిరిస్తున్నారట

నా మీటింగులకు వస్తే ఇళ్లు ఇవ్వమని బెదిరిస్తున్నారట

పోరాడితే తప్ప డబుల్ బెడ్ రూం ఇళ్లు రావన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కిరాయి ఇళ్లలో పేదలు చనిపోతే శవాన్ని ఇంటి యజమాని అనుమతించడం లేదని, అనాథ శవాల్లా రోడ్డు పైనే ఉంచాల్సి వస్తోందని పేదలు ఆవేదన చెందుతున్నారన్నారు. శనివారం కంటోన్మెంట్ లో పర్యటించిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేదల ఓట్లేస్తేనే టీఆర్ఎస్ నేతలకు నౌకరీలు వచ్చాయని, వాళ్ల ఓట్లతో గెలిచి వాళ్లనే బెదిరించే పరిస్థితికి వచ్చారని ఆయన అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కేటీఆర్ ..డబుల్ ఇళ్ల సైట్లకు రావాలని… ఇక్కడ మహిళలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఓ వైపు కేంద్రం, నాబార్డ్ నుంచి పేదల ఇళ్ల కోసం రూ.9000 కోట్ల నిధులు వస్తే.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు డబుల్ ఇళ్ల నిర్మాణాలు ఆపేశారన్నారు. రేవంత్ రెడ్డి మీటింగులకు వెళితే ఇల్లు ఇవ్వమని అధికార పార్టీ వాళ్లు బెదిరిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు.