కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో కమిటీ సమావేశం

కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో కమిటీ సమావేశం
  • మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో కమిటీ సమావేశం శనివారం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగింది. మేనిఫెస్టో కమిటీకి శ్రీధర్ బాబు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి జాతీయ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన అంశాలు చర్చకు వచ్చాయి. ప్రాంతీయ ఎయిర్​పోర్టులు, వరంగల్ ఎయిర్ పోర్ట్ ఆధునీకరణ, సింగరేణి రైల్వే, స్పోర్ట్స్ యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక స్కూల్స్, నవోదయ బడులు తదితర అంశాలను మేనిఫెస్టోలో చేర్చే విధంగా ప్రణాళికలు రచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జానయ్య, జనక్ ప్రసాద్, రియాజుద్దీన్, వినోద్ కుమార్, అనంతుల శ్యామ్ మోహన్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు