కేసీఆర్​ మాటలు నమ్మి మోసపోవద్దు : షబ్బీర్ ​అలీ

కేసీఆర్​ మాటలు నమ్మి మోసపోవద్దు : షబ్బీర్ ​అలీ

కామారెడ్డిటౌన్, వెలుగు :  ప్రజలు కేసీఆర్​ మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ సూచించారు. శుక్రవారం మాచారెడ్డి మండలం భవానిపేటలో  గడపగడపకు  కాంగ్రెస్​ పార్టీ ప్రోగ్రామ్​ నిర్వహించారు. పార్టీ 6 గ్యారంటీ  స్కీమ్స్​ పాంప్లేట్స్​ను ఇంటింటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్​తో కలిసి ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్​ పార్టీని గెలిపిస్తే  ప్రజలకు దగ్గరగా ఉండి  సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 

పైడిమల్ లో... 

బోధన్​/వర్ని, వెలుగు : ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్ని మండల అధ్యక్షుడు కులకర్ణి సురేశ్​బాబా ధీమా వ్యక్తం చేశారు. వర్ని మండలం లోని పైడిమల్ గ్రామంలో శుక్రవారం ఆయన  కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. బోధన్​ మండలంలోని పెంటకలాన్​, భూలక్ష్మిక్యాంప్​, బర్దిపూర్​, పెగడపల్లి గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్​రావు, నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. 

బాసర వరకు పాదయాత్ర

నందిపేట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుతూ శుక్రవారం నందిపేట మండల పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్, ​నియోజకవర్గ యూత్​ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  బైండ్ల ప్రశాంత్​​నిర్మల్​ జిల్లా బాసర సరస్వతీ దేవి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. యాత్రకు ఆర్మూర్​ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్​రెడ్డి, గొర్త రాజేంధర్​ మద్దతు తెలిపారు.