న్యూఢిల్లీ: రాజ్యాంగం ద్వారా ఏర్పాటై న సంస్థలను ఒక్కొక్కటిగా మోడీ సర్కారు నాశనం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి కొత్త చైర్మన్ నియామకంపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. తమ పార్టీతో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో సంబంధాలు ఉన్న మనోజ్ సోనిని ప్రభుత్వం యూపీఎస్సీ చైర్మన్గా నియమించింది. దీనిని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. శాసనాల అమలులో కీలకమైన యూపీపీఎస్సీ వంటి సంస్థలలో తమ కు నచ్చిన వాళ్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం అమలుకు ఈ సంస్థలే కీలకమని, వీటిని ఒక్కొక్క టిగా నాశనం చేస్తూ మోడీ సర్కారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈమేరకు మనోజ్ సోనీకి ఆర్ఎస్ఎస్, బీజేపీతో అనుబంధం ఉందన్న మీడియా రిపోర్టుతో సహా రాహుల్ ఈ ట్వీట్ చేశారు.
Union Pracharak Sangh Commission.
— Rahul Gandhi (@RahulGandhi) April 18, 2022
India’s Constitution is being demolished, one Institution at a time. pic.twitter.com/8HEMnmVyTo