
హైదరాబాద్, వెలుగు: సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా సోమవారం నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ సభ’కు కాంగ్రెస్ లీడర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ప్రియాంకా గాంధీ చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారు.
నిరుద్యోగులు, స్టూడెంట్స్, యువతే లక్ష్యంగా నిర్వహించే ఈ సభలో ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రియాంక ప్రకటిస్తారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ సహా పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం, నిరుద్యోగం, యువత పడుతున్న బాధలపై సర్కారు లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సభను నిర్వహిస్తున్నది.