సర్వపిండి, మటన్ కర్రీ.. సీడబ్ల్యూసీలో 126 రకాల ఫుడ్ వెరైటీలు

సర్వపిండి, మటన్ కర్రీ.. సీడబ్ల్యూసీలో 126 రకాల ఫుడ్ వెరైటీలు

హైదరాబాద్​, వెలుగు :  సీడబ్ల్యూసీ మీటింగ్ కోసం కాంగ్రెస్ అగ్రనాయకులంతా హైదరాబాద్​ రానున్నారు. అతిథులకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా126 రకాల తెలంగాణ ఫుడ్​ వెరైటీలను వడ్డించనున్నట్టు తెలిసింది. టిఫిన్​ నుంచి లంచ్​ వరకు మొత్తం తెలంగాణ స్టైల్​ ఫుడ్​తో వారికి విందును ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మన ఫుడ్​స్పెషల్స్​ను తయారు చేయించేందుకు వంట మనుషులను తీసుకొస్తున్నట్టు చెప్పారు. వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన షెఫ్​లు కూడా వంటకాలను తయారు చేయనున్నారు. పొద్దున ఇడ్లీ, వడ, దోశ, ఫ్రూట్ సలాడ్​ ఉప్మా, కిచిడీ, కుర్మా, రాగి సంకటి, మిల్లెట్​ వడలను టిఫిన్​గా వడ్డించనున్నారు.

మధ్యాహ్నం లంచ్​కు హైదరాబాదీ స్పెషల్​ చికెన్​ ధమ్​ బిర్యానీ, బగార అన్నం, బోటి కూర, తలకాయ కూర, పాయ, మటన్​, మేక లివర్​ ఫ్రై, తెలంగాణ స్పెషల్​ మటన్​ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్​, దోసకాయ మటన్​, అంకాపూర్​ చికెన్​, చేపలు, హలీం వంటి వాటిని నాన్​ వెజ్​ మెనూ పెడ్తున్నట్టు తెలిసింది. వెజ్​లో పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు .. ఇక స్నాక్స్​ ఐటెమ్స్​లో సర్వపిండి, కుడుములు, మురుకులు, మక్క గుడాలు, మొక్క జొన్న గారెలు, సకినాలు, గారెలను అతిథులకు రుచి చూపించనున్నారు. వాటితో పాటు తెలంగాణ, హైదరాబాద్​ స్పెషల్​ 12 రకాల స్వీట్లను అతిథులకు వడ్డిస్తారట. ఇక, సాయంత్రం ఇరానీ చాయ్​, ఉస్మానియా బిస్కెట్లను అందిస్తారని చెప్తున్నారు. తెలంగాణ వంటలతో పాటు దక్కన్​ వంటలను మెనూలో పెడ్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.