మంథని మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్

మంథని మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంథని మున్సిపల్ చైర్మన్ గా పెండ్రు రమ, వైస్ చైర్మన్ గా శ్రీపతి బాణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది మద్దతుతో నూతన మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక అయింది.

గత ఫిబ్రవరి 16న అప్పుడున్న చైర్మన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ లపై అవిశ్వాసం నెగ్గింది. మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. మంథని మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతామని.. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని నూతనంగా ఎన్నికైన చైర్మన్ రమ అన్నారు.

ALSO READ :- జనంలోకి జగన్ - బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ..