నెలాఖరు నాటికి మండల కమిటీలు.. కాంగ్రెస్ నేత మహేశ్​కుమార్

నెలాఖరు నాటికి మండల కమిటీలు.. కాంగ్రెస్ నేత మహేశ్​కుమార్

హైదరాబాద్, వెలుగు: తమ పార్టీ మండల కమిటీలను ఈ నెలాఖరునాటికి ఖరారు చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్ ​కుమార్​ గౌడ్​అన్నారు.  శనివారం ఆయన గాంధీ భవన్​లో పార్టీ వైస్ ​ప్రెసిడెంట్లు, జనరల్​ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్​ రాచరిక, అవినీతి పాలనను రాష్ట్ర ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. బూత్​ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, డిజిటల్​మెంబర్ ​షిప్​ను వాడుకోవాలని చెప్పారు. రాష్ట్రానికి కొత్త ఏఐసీసీ ఇన్ చార్జి సెక్రటరీలుగా విష్ణునాథన్, యువ నాయకుడు మన్సూర్​ అలీ వస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్​లు, ఐపీఎస్​లు తెలంగాణ సంపదను లూటీ చేస్తున్నారని మహేశ్ ఆరోపించారు.