ఆదిలాబాద్టౌన్, వెలుగు: బేల మండలంలోని కొబ్బయి గ్రామంలో ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్టేకం సత్యపాల్ మంగళవారం కాంగ్రెస్లో చేరారు. ఆయనకు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ఆఫీస్లో పార్టీ సీనియర్నాయకులు వైద్య నానాజీ పాటిల్, గిమ్మ సంతోష్రావు కండువా కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆకర్షితుడై ఆయన పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, ఆశన్న, కొండూరి రవి, మాడవి జనార్ధన్, ఖయ్యూం, ప్రమోద్, వికాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
