కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్లలో రామకృష్ణాపూర్ పోలీసులు ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, ముస్తఫాను ఆదివారం ఉదయం మంచిర్యాల మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
అనంతరం వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈనెల 17న క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్పై బీఆర్ఎస్ లీడర్లు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాళ్లు, ట్రాఫిక్ డివైడర్ కోన్లతో దాడి చేశారు.
