నర్సంపేటలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం

నర్సంపేటలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం

నర్సంపేట, వెలుగు: వరంగల్​ జిల్లా నర్సంపేటలో బీజేపీ ఆఫీస్​ను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్​రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్​ లెవల్​ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా క్యాడర్​ ముందుకు సాగాలన్నారు. అనంతరం నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్​రావు, గోగుల రాణాప్రతాప్​రెడ్డి, గూడూరు సందీప్​ తదితరులు పాల్గొన్నారు.