జమ్మూకశ్మీర్ లో పున:ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

జమ్మూకశ్మీర్ లో పున:ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్  చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది.  ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.

జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న  రాహుల్ పాదయాత్ర  భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం  రద్దయింది. పాదయాత్రలో భాగంగా రాహుల్ బనిహాల్ టన్నెల్ క్రాస్ అవుతుండగా ఆయన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే జనాన్ని నియంత్రించాల్సిన స్థానిక పోలీసులు అకస్మాతుగా అదృశ్యమయ్యారు. దీంతో జనసముదాయాన్ని నియంత్రించడంలో లోపాలున్నట్లు గుర్తించిన రాహుల్ సెక్యూరిటీ పాదయాత్రను విరమించుకోవాలని సూచించారు. సెక్యూరిటీ సూచనతో రాహుల్ యాత్రను ఆపేసి నైట్ షెల్టర్కు వెళ్లిపోయారు. దీంతో కశ్మీర్ లోయలో 11 కిలోమీటర్లు సాగాల్సిన రాహుల్ యాత్ర ఒక కిలోమిటర్కే పరిమితమైంది.