డ్యూటీలో ఎవరున్నారు?.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ ట్వీట్‌తో బీజేపీపై కాంగ్రెస్ సెటైర్

డ్యూటీలో ఎవరున్నారు?.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ ట్వీట్‌తో బీజేపీపై కాంగ్రెస్ సెటైర్

న్యూఢిల్లీ: కరోనాతోపాటు ఇండో–చైనా బార్డర్ వివాదం, ఎకానమీపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకొని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలుమార్లు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్‌ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ నాయకులు కూడా ఎదురుదాడికి దిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్‌ను టార్గెట్‌గా చేసుకొని బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై విపక్షం ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్యారడీ రోస్టర్‌‌ను రూపొందించి, అందులో సోమ నుంచి ఆది వరకు అన్ని వారాలు వాటికి ఎదురుగా ప్రముఖ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల పేర్లతో రాసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. కాంగ్రెస్, రాహుల్‌ను టార్గెట్‌గా చేసుకొని సదరు బీజేపీ నేతలు వర్క్ ఫ్రమ్ హోం చేస్తారనే అర్థం వచ్చేలా కాంగ్రెస్ రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ పోస్ట్‌కు ఇవ్వాళ ఎవరు డ్యూటీలో ఉన్నారు? అనే ప్రశ్నను జత చేసింది. కాంగ్రెస్ పోస్ట్ చేసిన ప్యారడీ రోస్టర్‌‌లో కేంద్ర మంత్రులు ఎస్‌.జైశంకర్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌తోపాటు స్మృతి ఇరానీ పేర్లు ఉన్నాయి. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్స్ దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ రోస్టర్‌‌లో ప్రధాని మోడీ, మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్లు లేవని కామెంట్ చేస్తున్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేరు కూడా లేదంటూ పలువురు కామెంట్ చేశారు.